Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా: అత్యాచారం.. ప్రతిఘటించిందని కదిలే రైలు నుంచి నెట్టేసిన దుండగులు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (19:56 IST)
మహిళలపై అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా హర్యానాలోని ఫతేబాద్‌లో దారుణ ఘటన జరిగింది. తోహనా పట్టణంలో మరికొద్ది నిముషాల్లో రైలు చేరనుంది. ఇంతలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోహ్‌తక్‌లో ఒక మహిళ తన కూతురుతో కలిసి ఉద్యోగం చేస్తుంది. ఆమె తోహానాలో ఉంటున్న భర్త దగ్గరకు వెళ్లేందుకు రైలు ఎక్కింది. 
 
మరికొన్ని నిముషాల్లో రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుతుందనగా షాకింగ్ ఘటన జరిగింది. ఆ భోగీలో మహిళ తన బిడ్డతో కలిసి ఉంది. అదే బోగీలో వున్న కొంతమంది దుండగులు మహిళపై అత్యాచారయత్నం చేశారు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను ట్రైన్ నుంచి బైటకు తోసేశారు. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది
 
ఈ క్రమంలో నిందితుడు కూడా రైలు నుంచి బయటకు దూకేశాడు. రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుకోగానే బాధితురాలి భర్త.. తన భార్య పిల్లల కోసం వెతుకుతున్నాడు. కోచ్‌లో తన కుమార్తె ఏడుస్తూ కన్పించింది. దీంతో బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలిపింది. 
 
ఈ క్రమంలో.. అతను కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అక్కడ గాయపడిన ఒక నిందితుడు సందీప్ (27)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసులను రంగంలోనికి దింపి, విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments