Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా: అత్యాచారం.. ప్రతిఘటించిందని కదిలే రైలు నుంచి నెట్టేసిన దుండగులు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (19:56 IST)
మహిళలపై అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా హర్యానాలోని ఫతేబాద్‌లో దారుణ ఘటన జరిగింది. తోహనా పట్టణంలో మరికొద్ది నిముషాల్లో రైలు చేరనుంది. ఇంతలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోహ్‌తక్‌లో ఒక మహిళ తన కూతురుతో కలిసి ఉద్యోగం చేస్తుంది. ఆమె తోహానాలో ఉంటున్న భర్త దగ్గరకు వెళ్లేందుకు రైలు ఎక్కింది. 
 
మరికొన్ని నిముషాల్లో రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుతుందనగా షాకింగ్ ఘటన జరిగింది. ఆ భోగీలో మహిళ తన బిడ్డతో కలిసి ఉంది. అదే బోగీలో వున్న కొంతమంది దుండగులు మహిళపై అత్యాచారయత్నం చేశారు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను ట్రైన్ నుంచి బైటకు తోసేశారు. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది
 
ఈ క్రమంలో నిందితుడు కూడా రైలు నుంచి బయటకు దూకేశాడు. రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుకోగానే బాధితురాలి భర్త.. తన భార్య పిల్లల కోసం వెతుకుతున్నాడు. కోచ్‌లో తన కుమార్తె ఏడుస్తూ కన్పించింది. దీంతో బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలిపింది. 
 
ఈ క్రమంలో.. అతను కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అక్కడ గాయపడిన ఒక నిందితుడు సందీప్ (27)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసులను రంగంలోనికి దింపి, విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments