Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా : తమ్ముడికి పంగనామం... చీటింగ్ కేసులో ముగ్గురి అరెస్టు

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (14:44 IST)
ధన దాహం ఎంతటి వారినైనా మార్చేస్తుంది. ఏ పనైనా చేయిస్తుంది. దానికి బంధాలు అనుబంధాలు అనే తారతమ్యం లేదు. డబ్బు, ఆస్తి కోసం అన్నదమ్ములు, తండ్రి కోడుకులు మధ్య విరోధాలు పెరిగిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి ఎన్నారై విషయంలో జరిగింది. సొంత తమ్ముడే అన్నను మోసం చేశాడు. అన్న ఆస్తులన్నీ తన కోడుకుల పేరుతో మార్చేశాడు. డబ్బు అవసరం వచ్చి పొలాలను విక్రయించాలనుకున్న అన్నకు చిల్లిగవ్వ మిగలకుండా చేశాడు. దాదాపు 3 కోట్ల రూపాయల మేర ముంచేశాడని బాధితుడు అవేదన వ్యక్తం చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే, హర్యానాకు చెందిన హర్దీప్ సింగ్ అనే వ్యక్తి ఉద్యోగ నిమిత్తం 1971లొ అమెరికా వెళ్లాడు. చాలా కాలంగా అక్కడే ఉంటూ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చేవాడు. అన్న భారత్‌లో లేకపోవడంతో తమ్ముడు తనకు వచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ హక్కులతో అన్న పేరిట ఉన్న పొలాలను, స్థలాలను తన కుమారుడి పేరు మీదకు మార్చేశాడు. హర్దీప్ సింగ్‌కి ఇటీవల డబ్బు అవసరమై భారత్‌లో ఉన్న తన పొలాలను విక్రయించాలనుకున్నాడు. 
 
వాటిని కొనేందుకు అనేక పార్టీలు ముందుకు వచ్చాయి. అయితే అప్పుడే అసలు విషయం బయటపడింది. తన పొలాలన్ని ఇప్పుడు తన పేరు మీద లేవని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాడు. తమ్ముడే ఇలా మోసం చేయడంతో ఎవరికీ చెప్పుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్దీప్ సోదరుడు అవతార్‌ను, అతని కుమారులు హర్‌ప్రీత్, జస్మీత్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments