Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకిరీల చెర నుంచి యువతిని రక్షించిన రైల్వే మంత్రి

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (14:34 IST)
రైలులో భోపాల్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న యువతిని రైల్వే మంత్రి ఆదుకున్నారు. ఇబ్బందులలో ఉన్న యువతి సోదరుడి ట్వీట్ మేరకు మంత్రి గారు వెంటనే చర్య తీసుకున్నారు. పోలీసులను పంపి ఆమెను కాపాడారు. విశాఖపట్టణం నుంచి న్యూఢిల్లీ వెళుతున్న ట్రైన్ నంబర్ 22415 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువతి భోపాల్ నుండి న్యూఢిల్లీ వెళ్తోంది. 
 
ఇంతలో కొందరు ఆకతాయిలు మద్యం సేవించి ఆమె ఉన్న బోగీలోకి ప్రవేశించారు. మహిళను అల్లరి చేయడం మొదలు పెట్టారు. బాధితురాలి సోదరుడు నిస్సహాయ స్థితిలో రైల్వే మంత్రికి ట్వీట్ చేసాడు. నా చెల్లిని కాపాడండి, నేను ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నాను, కొందరు పోకిరీలు వచ్చి నా చెల్లిని అల్లరి పెడుతున్నారు. ఆమె ట్రైన్ నంబర్ 22415లో ఉంది. నేనిప్పుడు రాంచీలో ఉన్నాను అని అభ్యర్థించాడు. 
 
ఈ సందేశాన్ని స్వీకరించిన వెంటనే రైల్వే మంత్రి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆ మహిళను వెంటనే రక్షించమని ఆగ్రా పోలీసులను ఆదేశించారు. ఆ తర్వాత మంత్రి బాధితురాలి సోదరుడికి తిరిగి ట్వీట్ చేసి మీరు నిశ్చింతగా ఉండండి, మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. కాసేపటికి పోలీసులు బోగీలోకి ఎక్కి పోకిరీలను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోదరుడికి తెలియజేసారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments