Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిమ్మల్ని షో దగ్గర కలుస్తా': గాయని... కారులో ఎక్కించుకుని పంట పొలాల్లో...

ఇటీవల హర్యానా రాష్ట్రంలో కనిపించకుండా పోయిన గాయని మమతా శర్మ శవమై కనిపించింది. ఆమె మృతదేహం పంట పొలాల్లో లభ్యమైంది. అదీ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వగ్రామం బనియానీ సమీపంలో మృతదేహమై

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (12:45 IST)
ఇటీవల హర్యానా రాష్ట్రంలో కనిపించకుండా పోయిన గాయని మమతా శర్మ శవమై కనిపించింది. ఆమె మృతదేహం పంట పొలాల్లో లభ్యమైంది. అదీ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వగ్రామం బనియానీ సమీపంలో మృతదేహమై కనిపించడం తీవ్ర కలకలాన్ని రేపింది. 
 
గత ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో మోహిత్‌తో కలసి సోనిపట్ జిల్లాలోని గోహనా పట్టణంలో సంగీత విభావరి కార్యక్రమానికి మమతా వెళ్లింది. ఆపై 10.30 గంటల సమయంలో మోహిత్, మమత కుటుంబీకులకు కాల్ చేసి, ఆమె మరికొందరితో కలసి ఇంకో కారులో వెళ్లిందని చెప్పాడు. 
 
వారు తనకు తెలుసునని, ఈవెంట్ వద్ద కలుస్తానని ఆమె చెప్పిందని, కానీ ఆమె అక్కడికి రాలేదని సమాచారం ఇచ్చాడు. వెంటనే ఆమె సెల్ ఫోన్‌కు రింగ్ ఇస్తే, ఫోన్ రింగ్ అయినా ఎవరూ ఎత్తలేదు. ఆపై సోమవారం ఉదయానికి స్విచ్చాఫ్ వచ్చింది. ఆ వెంటనే మమత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 
 
ఇంతలో ఆమె మృతదేహం రోహ్‌తక్ జిల్లాలోని బనియానీ సమీపంలోని పంట పొలాల్లో గురువారం మధ్యాహ్నం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు కారులో ఎవరు వెళ్లారన్న విషయాన్ని విచారిస్తున్నామని పోలీసులు చెబుతుండగా, ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించక పోవడంతోనే ఇంత ఘోరం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments