Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని శీతల పానీయంలో విష పదార్థం కలిపి ఇచ్చి..?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (14:57 IST)
ప్రియురాలిని ఓ ప్రియుడు హతమార్చాడు. అదీ శీతల పానీయంలో విష పదార్థం కలిపి ఇచ్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కురుక్షేత్రలోని భోలి గ్రామానికి చెందిన పింకీకి రవి అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే రవి డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. దీంతో మూడేళ్ల క్రితం భర్త నుంచి వేరుపడి మకాంను ఆకాశ్ నగర్‌కు మార్చింది. ఆకాశ్ నగర్‌లో పింకీ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. 
 
పింకీకి గంగా సింగ్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గంగా సింగ్ మంచి మద్యం ప్రియుడు. గత కొన్ని రోజుల నుంచి పింకీని గంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తనకు మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని ఆమెను హింసిస్తున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పింకీ కూతురు తన సోదరుడికి విషయం చెప్పింది.
 
మొత్తానికి పింకీ ఇంటికి గంగా సింగ్ తన భార్యతో కలిసి ఆగస్టు 8న వచ్చాడు. ఆమెకు శీతల పానీయాల్లో విష పదార్థం కలిపి ఇచ్చారు. ఆమె ఆ పానీయాన్ని సేవించిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పింకీ కన్నుమూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments