Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పటేల్‌కు రెండేళ్ల జైలుశిక్ష.. రూ.50వేల జరిమానా

2015 గుజరాత్ పటీదార్ ఉద్యమం సమయంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా భారీ హింస చెలరేగింది. ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌, హింసకు ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారంటూ కేసు నమోద

Webdunia
బుధవారం, 25 జులై 2018 (13:58 IST)
2015 గుజరాత్ పటీదార్ ఉద్యమం సమయంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా భారీ హింస చెలరేగింది.  ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌, హింసకు ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో పటేల్ కోటా ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇంకా రూ.50వేల జరిమానా కూడా విధిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇకపోతే.. 2015లో పటేల్‌ రిజర్వేషన్ల ఉద్యమంలో మూడు వేల మంది పాల్గొన్నారు. ఈ కేసులో 17మందిపై కుట్ర, దాడి, అల్లర్ల కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లోనే అరెస్ట్ అయిన హార్దిక్.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. కొన్ని నెలలు మెహసానా జిల్లాలోకి ప్రవేశించకుండా కోర్టు కూడా ఆంక్షలు విధించింది. 
 
ఈ కేసులో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. హార్దిక్‌తోపాటు సర్దార్‌ పటేల్‌ వర్గం నేత లాల్జీ పటేల్‌, ఏకే పటేల్‌ను కూడా  దోషులుగా నిర్దారించింది. వీరికి కూడా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానాను కోర్టు విధించింది. మరోవైపు తీర్పువెలువడిన వెంటనే హార్దిక్‌కు చెందిన న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments