Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడిదలు గర్భందాల్చితే సీమంతాలు.. పిల్లలు పుడితే బారసాలాలు కూడా.. ఎక్కడ...!?

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (16:27 IST)
గర్భందాల్చిన గాడిదలకు సీమంతాలు చేస్తున్నారు. వాటి పిల్లలకు బారసాలలు నిర్వహిస్తున్నారు. ఈ విచిత్ర ఆచారం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంత వాసులు ఇలా చేయడానికి ప్రధాన కారణం లేకపోలేదు. హలరీ అనే గాడిద జాతి అంతరించి పోయే పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ జాతి గాడిదలను కాపాడేందుకు ఆ ప్రాంత ప్రజలు వింతగా సీమంతాలు చేస్తున్నారు. 
 
ఈ జాతి గాడిదల సంఖ్యను పెంచేందుకు చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి. అందుకే ఈ జాతి గాడిదలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. పైగా ఆ గాడిదలకు పుట్టే పిల్లలకు బారసాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మన గృహాల్లో ఏ విధంగా శుభకార్యాలు చేస్తారో అదేవిధంగా ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. 
 
కొన్ని రోజుల క్రితం ఉప్లేటా తాలూకాలోని కోల్కి అనే గ్రామంలో హరరీ జాతి గాడది ఈనింది. దీంతో ఆ గ్రామ వాసులు సంబరాలు చేసుకున్నారు. పశువులు కాపరులు, ఇతరులు కలిసి బారసాల చేశారు. గర్భందాల్చిన మరో 33 గాడిదలకు కూడా సీమంతం కూడా చేశారు. నుదిటిన తిలకం దిద్ది, వస్త్రాలు కప్పారు. మహిళలు పూజ చేసి, ఆహారం వడ్డించారు. 
 
ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రుపాలా కూడా వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. కాగా, ప్రస్తుతం హలరీ జాతి గాడిదలు గుజరాత్ రాష్ట్రంలో కేవలం 417 మాత్రమే ఉన్నాయి.  

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments