Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల కూతురున్న తల్లిపై అత్యాచారం.. పోలీసులకు కంప్లైంట్ చేశారని..?

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (22:01 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఏడేళ్ల కూతురున్న తల్లిపై అత్యాచారానికి పాల్పడిన దుండగుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో మరోసారి ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. కుటుంబం మొత్తానికి నిప్పు పెట్టి కాల్చేయడానికి ప్రయత్నించడంతో తీవ్రగాయాల పాలై గవర్నమెంట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. 
 
అక్టోబర్ 31న 32ఏళ్ల మహిళ ఇంట్లో ఉండగా చొరబడిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి ఎవ్వరికీ చెప్పొద్దని హెచ్చరించాడు. భర్తతో పాటు పిల్లలకు ఘటన గురించి చెప్పిన ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకోలేదు. ఆ తర్వాత మళ్లీ అతణ్ని కలవాలని, ఒంటరిగా రమ్మంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు.
 
దానికి నిరాకరించిన మహిళ.. భర్త సాయంతో స్టేషన్‌కు వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ గురించి తెలుసుకున్న పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులకు వెళ్లగా అతని తల్లి తన కొడుకుకు గాయాలయ్యాయని హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడని చెప్పింది.
 
మహారాష్ట్రలోని గ్వాలియర్ పోలీస్ సూపరిండెంట్ అమిత్ సంఘీ మాట్లాడుతూ.. ఘటనపై ఎంక్వైరీ చేస్తున్నామని.. తాటిపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి అత్యాచారం దాడి కంప్లైంట్ నమోదు కాలేదని చెప్పారు. నిందితుడ్ని ఇంకా అరెస్ట్ చేయలేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments