Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ ఫలితాలతో దిమ్మతిరిగిపోతుంది : హార్దిక్ పటేల్

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగిపోయేలా ఉంటాయని పటీదార్ అనామత్ ఆందోళన్ నాయకుడు హార్దిక్ పటేల్ జోస్యం చెప్పారు.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (15:32 IST)
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగిపోయేలా ఉంటాయని పటీదార్ అనామత్ ఆందోళన్ నాయకుడు హార్దిక్ పటేల్ జోస్యం చెప్పారు. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగింది.
 
ఈ ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును అహ్మదాబాద్‌లో వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గుజరాత్ ఎన్నికల ఫలితాలు దిమ్మదిరిగేలా ఉంటాయన్నారు. గుజరాత్ ఓటర్లు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పనున్నారని, తమ అంచనాలకు తగినట్టుగానే ఫలితాలు ఉంటాయన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ సారధ్యంలోని పటీదార్ ఆందోళన్ సమితి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుండగా, వడోదరాలో వడోదరా మహరాజ్ సమర్జీత్ సింగ్ గైక్వాడ్, ఆయన తల్లి రాజమాత శుభాంగినీ దేవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఓటు వేశారు. చోటా ఉదయ్‌పూర్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటింగ్ ప్రక్రియ గంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. ముస్లిం ప్రభావిత ప్రాంతమైన జుహూపురాలో చాలా తక్కువ పోలింగ్ నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments