Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో దారుణం : మీసం తిప్పాడని ఇంటిమీద పడి చితక్కొట్టారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో దారుణం జరిగింది. మీసం తిప్పాడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఆ వ్యక్తిని చితకబాదారు. ఈ దాడికి పాల్పడింది దర్బార్ వర్గీయులు కావడం గమనార్హం. ఆలస్యంగా వెలు

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (14:25 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో దారుణం జరిగింది. మీసం తిప్పాడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఆ వ్యక్తిని చితకబాదారు. ఈ దాడికి పాల్పడింది దర్బార్ వర్గీయులు కావడం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
మెమద్‌పూర్ గ్రామానికి చెందిన మహేష్ పార్మార్‌ అనే యువకుడికి మీసాలు పెంచడమంటే ఇష్టం. అయితే అదే తన కుటుంబంపై దాడికి కారణమవుతుందని అతడు ఊహించలేదు. ఈ నెల 12న అలవాటు ప్రకారం ఓ రోజు రోడ్డుపక్కన హోటల్‌ వద్ద నిలబడి మహేష్ మీసాలు తిప్పుతున్నాడు. అతని ఎదురుగా నిలబడిన దర్బార్ వర్గానికి చెందిన వ్యక్తులు ఇది సహించలేకపోయారు. 
 
కొందరు వ్యక్తులు మహేష్ వద్దకు వెళ్లి... నీది ఏ కులం... నువ్వు మీసాలు ఎందుకు తిప్పుతున్నావని ప్రశ్నించారు. తాను పార్మార్ కులస్తుడనని చెప్పగానే వారు మహేశ్‌ని తిడుతూ కొట్టడం మొదలుపెట్టారు. తర్వాత పెద్దల సలహా మేరకు తన తమ్ముడు దర్బార్ వర్గీయులతో రాజీ చేసుకున్నాడు. అయినప్పటికీ.. కోపం చల్లారని దర్బార్ వర్గీయులు మహేష్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. తమను వదిలిపెట్టాలని ప్రాధేయపడినా కులం పేరుతో తిడుతూ చితక్కొట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments