Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో ర్యాగింగ్ భూతం.. 3 గంటల పాటు నిలబెట్టడంతో వైద్య విద్యార్థి మృతి

ఠాగూర్
మంగళవారం, 19 నవంబరు 2024 (14:44 IST)
గుజరాత్ రాష్ట్రంలో ర్యాగింగ్ భూతం బుసలుకొట్టింది. ఫలితంగా డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో కాలేజీలో అడుగుపెట్టిన ఓ వైద్య  విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సీనియర్లు... ఆ జూనియర్ విద్యార్థిని ఏకంగా 3 గంటల పాటు ఎండలో నిలబెట్టడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనకు సంబంధించిన 15 మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని జీఎంఈఆర్ఎస్ వైద్య కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 
 
మృతి చెందిన విద్యార్థిని అనిల్ మెథానియగా గుర్తించారు. గుజరాత్ రాష్ట్రంలోని ధారపుర్ పాటన్ ప్రాంతంలోని వైద్య కాలేజీలో చేరాడు. పరియం పేరుతో ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రెషర్లపై ర్యాగింగ్ చేశారు. ఈ క్రమంలో జూనియర్లను మూడు గంటల పాటు నిల్చోవాలని ఆదేశించారు. దీంతో అనిల్ స్పృహ కోల్పోయి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన సీనియర్లు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, అనిల్ చనిపోయేముందు ఇచ్చిన వాంగ్మూలంలో సీనియర్లు బలవంతంగా నిల్చోబెట్టడం వల్లే ఇలా జరిగిందంటూ వారి పేర్లను వెల్లడించాడు. ఇపుడు వారందరిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments