Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనుషుల్ని కూడా లెక్కచేయరా.. 12కి.మీ అలా లాక్కెళ్లిన కారు.. చివరికి?

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (13:33 IST)
మనుషులను లెక్కచేయకుండా వాహనదారులు లాక్కెళ్తున్న ఘటనలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుజరాత్ లో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి సాగర్ పాటిల్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన భార్య అశ్విని బెన్ తో కలిసి బైకుపై వెళ్తున్నాడు. 
 
కడోదరా-బర్దోలి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు వీరి బైకును ఢీకొంది. ఈ ఘటనలో అశ్వినిబెన్ రోడ్డుపై దూరంగా పడిపోయింది. కానీ బైకు నడుపుతున్న సాగర్ మాత్రం కనిపించలేదు. అతడు కారు కింద చిక్కుకున్నాడు. డ్రైవర్ మాత్రం ఆపలేదు. 
 
అలానే కారును ఆపకుండా డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయాడు. అలా కారు అతడిని 12 కిలోమీటర్ల మేర లాక్కెళ్లింది. దీంతో కారు కింద చిక్కుకున్న సాగర్ పాటిల్ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
అతడి మృతదేహాన్ని ఘటనా స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో, కమ్రేజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గుర్తించారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments