జియో సర్వీసులు మాత్రమే ముద్దు.. : గుజరాత్ సర్కారు ఆదేశం

Webdunia
బుధవారం, 10 మే 2023 (11:00 IST)
గుజరాత్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై కేవలం జియో సిమ్ సర్వీసులను మాత్రమే వినియోగించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం వాడుతున్న వొడాఫోన్‌ - ఐడియా సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేసినట్లు వెల్లడించింది. 
 
ఆ నంబర్లను రిలయన్స్‌ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.37.50కే పోస్ట్‌పెయిడ్‌ సేవలను ఉద్యోగులకు అందించనున్నట్లు జియో సైతం ప్రకటించింది. గుజరాత్‌ ప్రభుత్వం, రిలయన్స్‌ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు, జియో సేవలతో ఉద్యోగులకు నెలకు 30 జీబీ డేటా 4జీ సర్వీసులతో లభిస్తుంది. 
 
గుజరాత్ సర్కారు జియోతో రెండేళ్ల కాలపరిమితితో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆరు నెలల తర్వాత జియో సేవలను ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఈ సేవలు సంతృప్తికరంగా లేనిపక్షంలో ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తుంది. ఈ ఒప్పందంతో గత 12 సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు వొడాఫోన్ ఐడియా సేవలు అందిస్తూ వచ్చిన ఒప్పందం రద్దు అయింది. ఈ ఫోన్ నంబర్లను జియోకు పోర్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments