Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సర్వీసులు మాత్రమే ముద్దు.. : గుజరాత్ సర్కారు ఆదేశం

Webdunia
బుధవారం, 10 మే 2023 (11:00 IST)
గుజరాత్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై కేవలం జియో సిమ్ సర్వీసులను మాత్రమే వినియోగించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం వాడుతున్న వొడాఫోన్‌ - ఐడియా సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేసినట్లు వెల్లడించింది. 
 
ఆ నంబర్లను రిలయన్స్‌ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.37.50కే పోస్ట్‌పెయిడ్‌ సేవలను ఉద్యోగులకు అందించనున్నట్లు జియో సైతం ప్రకటించింది. గుజరాత్‌ ప్రభుత్వం, రిలయన్స్‌ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు, జియో సేవలతో ఉద్యోగులకు నెలకు 30 జీబీ డేటా 4జీ సర్వీసులతో లభిస్తుంది. 
 
గుజరాత్ సర్కారు జియోతో రెండేళ్ల కాలపరిమితితో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆరు నెలల తర్వాత జియో సేవలను ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఈ సేవలు సంతృప్తికరంగా లేనిపక్షంలో ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తుంది. ఈ ఒప్పందంతో గత 12 సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు వొడాఫోన్ ఐడియా సేవలు అందిస్తూ వచ్చిన ఒప్పందం రద్దు అయింది. ఈ ఫోన్ నంబర్లను జియోకు పోర్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments