Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సర్వీసులు మాత్రమే ముద్దు.. : గుజరాత్ సర్కారు ఆదేశం

Webdunia
బుధవారం, 10 మే 2023 (11:00 IST)
గుజరాత్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై కేవలం జియో సిమ్ సర్వీసులను మాత్రమే వినియోగించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం వాడుతున్న వొడాఫోన్‌ - ఐడియా సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేసినట్లు వెల్లడించింది. 
 
ఆ నంబర్లను రిలయన్స్‌ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.37.50కే పోస్ట్‌పెయిడ్‌ సేవలను ఉద్యోగులకు అందించనున్నట్లు జియో సైతం ప్రకటించింది. గుజరాత్‌ ప్రభుత్వం, రిలయన్స్‌ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు, జియో సేవలతో ఉద్యోగులకు నెలకు 30 జీబీ డేటా 4జీ సర్వీసులతో లభిస్తుంది. 
 
గుజరాత్ సర్కారు జియోతో రెండేళ్ల కాలపరిమితితో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆరు నెలల తర్వాత జియో సేవలను ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఈ సేవలు సంతృప్తికరంగా లేనిపక్షంలో ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తుంది. ఈ ఒప్పందంతో గత 12 సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు వొడాఫోన్ ఐడియా సేవలు అందిస్తూ వచ్చిన ఒప్పందం రద్దు అయింది. ఈ ఫోన్ నంబర్లను జియోకు పోర్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments