Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు గుజరాత్ తుదిదశ పోలింగ్.. 93 స్థానాల్లో పోలింగ్

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (08:12 IST)
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం రెండో దశ పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇది సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
 
ముఖ్యంగా, అహ్మదాబాద్, వడోదర, గాంధీ నగర్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న 93 నియోజకవర్గాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ దశలో అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో సహా మొతత్ం 61 రాజకీయ పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, ఆప్ పార్టీలు 93 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం 90 సీట్లలో పోటీ చేస్తుంది. 
 
ఈ దశలో మొత్తం 1.29 కోట్ల మంది పురుషులు, 1.22 కోట్ల మంది మహిళలతో సహా మొత్తం 2.51 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 14,975 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 1.13 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 18 నుంచి 19 యేళ్లలోపు 5.96 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments