Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ ముఖ్యమంత్రికి కరోనా వైరస్ సోకిందా?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (16:25 IST)
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా వైరస్ సోకిందా? సీఎంతో పాటు.. మరో ఇద్దరు మంత్రులతో సమావేశమైన తర్వాత ఓ ఎమ్మెల్యేలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ముఖ్యమంత్రితో పాటు.. సీఎం కార్యాలయ సిబ్బంది కూడా హడలిపోతున్నారు. 
 
గుజరాత్‌కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇమ్రానా ఖేడావాలాకు కొద్దిరోజులుగా జ్వరం వస్తున్నది. దాంతో ఆయన కరోనా పరీక్షలకు శాంపిల్ ఇచ్చారు. అయినా ఇంటిపట్టున ఉండకుండా బయట తిరుగుతున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు మరో ఇద్దరు మంత్రులతో సమావేశమయ్యారు. సీఎం దగ్గరకు వెళ్లడమేకాకుండా తర్వాత ఓ మీడియా సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఎట్టకేలకు కరోనా నిర్ధారణ కావడంతో ఆయన గాంధీనగర్‌లోని ఎస్వీపీ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేరారు. 
 
ఆయన ఇంకా ఎంతమందిని కలిశారో తెలియడం లేదు. వారందరినీ వెతికి క్వారంటైన్‌లో ఉంచడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే వ్యవహారంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ ఉదయం సీఎంతోనూ, ఆరోగ్య, హోంశాఖ మంత్రులతోనూ ఎమ్మెల్యే జరిపిన సమావేశం వీడియోను అధికారులు పరిశీలించగా అందులో పాల్గొన్నవారంతా సామాజిక దూరాన్ని పాటించినట్టు తెలిసింది. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments