Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు డ్రైవర్‌కు గుండెపోటు... తొమ్మిది మంది మృతి

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (10:42 IST)
accident
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది వరకు గాయాలపాలైనారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సూరత్‌లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ మహోత్సవ్‌కు హాజరైన కొందరు తిరిగి సొంతూళ్లకు లగ్జరీ బస్సులో వెళ్తుండగా... శనివారం తెల్లవారుజామున నవ్‌‌సారి జిల్లాలోని వెస్మా గ్రామ సమీపంలోకి వచ్చేసరికి బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అతడి కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ కారును ఢీకొట్టింది.
 
ఈ ఘటనలో కారులో వున్న తొమ్మిది మందిలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో వున్న 28 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments