గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (14:33 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ట్రక్కు ఒక్కటి గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. సోమవారం వేకువజామున ఈ దారుణం జరిగింది. 
 
అమ్రేలి ఎస్పీ నిర్లిప్త్‌రారు కథనం మేరకు సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో క్రేన్‌ను తరలిస్తుండగా ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. 
 
ఆ సమయంలో గుడిసెలో పదిమంది నిద్రిస్తుండగా వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఎనిమిదిమంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు... ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
మరణించినవారిలో ఇద్దరు వృద్ధులతో పాటు 8-13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments