Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (14:33 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ట్రక్కు ఒక్కటి గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. సోమవారం వేకువజామున ఈ దారుణం జరిగింది. 
 
అమ్రేలి ఎస్పీ నిర్లిప్త్‌రారు కథనం మేరకు సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో క్రేన్‌ను తరలిస్తుండగా ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. 
 
ఆ సమయంలో గుడిసెలో పదిమంది నిద్రిస్తుండగా వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఎనిమిదిమంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు... ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
మరణించినవారిలో ఇద్దరు వృద్ధులతో పాటు 8-13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments