Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేట్ భర్త, భార్య సంతోషం కోసం ఆమె తుది శ్వాస వరకూ...

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (12:27 IST)
భయకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భార్య..  ఒక్కాగానొక్క కొడుకు. భార్య మరికొద్దిరోజుల్లోనే చనిపోతుందని తెలుసు. అయినా గుండె నిబ్బరం చేసుకున్నాడు. ఆమె బతికి ఉన్నన్ని రోజులు ఎలాగైనా ఆమె అనుకున్న కోర్కెను తీర్చాలని భావించాడు. కానీ ఒకే ఒక కోరిక కోరిందామె. దాని కోసం నానా తంటాలు పడ్డాడు ఆ భర్త.
 
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన రమేష్, జ్యోతిలకు ఆరేళ్ళ క్రితం వివాహమైంది. నాలుగేళ్ళ కొడుకు ఉన్నాడు. కానీ గత సంవత్సరంగా క్యాన్సర్ వ్యాధితో జ్యోతి బాధపడుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన భార్య చనిపోతుందని వైద్యులు చెప్పారు.
 
దీంతో లోలోపల బాధపడ్డ రమేష్. ఆమె చనిపోయేంత వరకు సంతోషంగా ఆమెను పెట్టాలని భావించాడు. సచిన్ టెండూల్కర్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. కొచ్చిలో ఇండియన్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఆటలో ఆడే ఆటగాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపేందుకు సచిన్ వస్తున్నాడని తెలిసింది. 
 
ఈ విషయం జ్యోతికి తెలిసింది. తనకు ఇష్టమైన క్రికెటర్‌ను చూడాలంది. అంతే... రమేష్ ఎంత కష్టమైనా గంటల తరబడి క్యూలైన్లో నిలబడి ఉన్నాడు. టిక్కెట్లు అయిపోయాయి. అయితే నిర్వాహకుల దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడ్డాడు. అసలు విషయం చెప్పాడు. దీంతో కరిగిపోయిన వారు ప్రత్యేకంగా రెండు టిక్కెట్లను అందజేశారు.
 
భార్యను నేరుగా స్టేడియంకు తీసుకెళ్ళాడు. సచిన్‌ను అక్కడ చూసిన జ్యోతి గట్టిగా అరిస్తూ కనిపించింది. ఎంతో ఆనందంతో ఉన్న ఆమెను చూసి భర్త కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆమె లేదు. చనిపోయింది. ఇదే విషయాన్ని తన ఫేస్‌బుక్‌లో పెట్టి గుర్తు చేసుకున్నాడు రమేష్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments