Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 40,953 కేసులు, 188 మంది మృతి

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (12:21 IST)
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. శుక్రవారం కొత్తగా 40,953 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 25,000లకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఇక మిగతా రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. మధ్యప్రదేశ్‌, తమిళనాడులో వెయ్యికి పైగానే కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్‌ఘర్‌లో కూడా రెండు నెలల తర్వాత వెయ్యికిపైగానే కేసులు నమోదయ్యాయి. జార్ఘండ్‌లో రెండు నెలల్లో మొదటిసారిగా కేసులు మూడంకెల సంఖ్యను దాటింది.
 
దేశం మొత్తం మీద 2.88 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 188 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,59,558. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 4 కోట్ల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అలాగే కోవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో.. కేంద్రం, రాష్ట్రాలకు మార్గదర్శకాలను సూచించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నియంత్రణా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఆరోగ్యం, ఇతర నిత్యావసర సేవలకు మినహా, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సామర్థంతో పనిచేయాలని శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments