Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 40,953 కేసులు, 188 మంది మృతి

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (12:21 IST)
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. శుక్రవారం కొత్తగా 40,953 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 25,000లకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఇక మిగతా రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. మధ్యప్రదేశ్‌, తమిళనాడులో వెయ్యికి పైగానే కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్‌ఘర్‌లో కూడా రెండు నెలల తర్వాత వెయ్యికిపైగానే కేసులు నమోదయ్యాయి. జార్ఘండ్‌లో రెండు నెలల్లో మొదటిసారిగా కేసులు మూడంకెల సంఖ్యను దాటింది.
 
దేశం మొత్తం మీద 2.88 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 188 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,59,558. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 4 కోట్ల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అలాగే కోవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో.. కేంద్రం, రాష్ట్రాలకు మార్గదర్శకాలను సూచించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నియంత్రణా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఆరోగ్యం, ఇతర నిత్యావసర సేవలకు మినహా, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సామర్థంతో పనిచేయాలని శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments