దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 40,953 కేసులు, 188 మంది మృతి

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (12:21 IST)
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. శుక్రవారం కొత్తగా 40,953 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 25,000లకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఇక మిగతా రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. మధ్యప్రదేశ్‌, తమిళనాడులో వెయ్యికి పైగానే కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్‌ఘర్‌లో కూడా రెండు నెలల తర్వాత వెయ్యికిపైగానే కేసులు నమోదయ్యాయి. జార్ఘండ్‌లో రెండు నెలల్లో మొదటిసారిగా కేసులు మూడంకెల సంఖ్యను దాటింది.
 
దేశం మొత్తం మీద 2.88 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 188 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,59,558. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 4 కోట్ల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అలాగే కోవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో.. కేంద్రం, రాష్ట్రాలకు మార్గదర్శకాలను సూచించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నియంత్రణా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఆరోగ్యం, ఇతర నిత్యావసర సేవలకు మినహా, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సామర్థంతో పనిచేయాలని శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments