Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులపై క్రమంగా పెరుగుతున్న వ్యతిరేకత

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (22:00 IST)
పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది. ఈ బిల్లులను వ్యతిరేకించిన బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు ఉన్నాయి.
 
హర్యానాలో బిజేపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న “జననాయక్‌ జనతా పార్టీ” (జేజేపీ) ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
 
ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా జేజేపీ చీఫ్‌ దుశ్యంత్‌ సింగ్‌ చౌతాలా కొనసాగుతున్నారు.
 90 స్థానాలు ఉన్న హరియాణాలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖట్టర్‌ నేతృత్వంలో బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ (46) లేదు.
 
పది స్థానాలలో గెలిచి కింగ్‌మేకర్‌గా దుష్యంత్‌ చౌతాలా నిలబడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం నుంచి “జననాయక్‌ జనతా పార్టీ” వైదొలిగితే ఖట్టర్‌ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments