Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ వాహనాలకు చెక్.. ఇకపై అధికారులకు ట్యాక్సీలే అద్దె వాహనాలు.. కేంద్ర నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ అధికారులంతా ఇకపై ట్యాక్సీల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వాహనాలను వినియోగించడానికి వీల్లే

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (13:37 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ అధికారులంతా ఇకపై ట్యాక్సీల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వాహనాలను వినియోగించడానికి వీల్లేకుండా ఆదేశాలను జారీ చేయనుంది. పైగా, ఈ రిజిస్టర్ ట్యాక్సీలనే అద్దె వాహనాలుగా పరిగణించనుంది. 
 
అనేక అధికారులు ప్రభుత్వ సొమ్ముతో విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసిన వాటిలో తిరగుతుంటారు. మరికొంతమంది ప్రభుత్వ అధికారులు వారి కుటుంబసభ్యులు.. బంధువుల పేరుమీద విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసి వాటినే అధికారిక వాహనాలుగా లీజుకు తీసుకుంటున్నారు. ఈ విషయం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ నిగ్గు తేల్చింది. దీనిపై ఓ నివేదికను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సమర్పించింది.
 
దీంతో ఇకపై అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన కార్లను కాకుండా.. కేవలం ట్యాక్సీగా రిజిస్టర్‌ అయిన కార్లనే వినియోగించాలని ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం. అంతేకాదు.. ట్యాక్సీ ఎంత దూరం ప్రయాణించింది.. ఏ పనిపై తీసుకుకెళ్లారన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments