Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 మంది బాలికలపై ప్రభుత్వోద్యోగి అత్యాచారం..ఎక్కడో తెలుసా?

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (08:25 IST)
పదేళ్లుగా 50 మంది బాలికలపై ఓ ప్రభుత్వోద్యోగి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన యూపీలో వెలుగు చూసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఓ జూనియర్‌ ఇంజనీర్‌ను ఎట్టకేలకు సిబిఐ అధికారులు అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.

కేసు వివరాలు పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామ్‌భవన్‌ అనే వ్యక్తి ఇరిగేషన్‌ శాఖలో జూనియర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వరిస్తున్నాడు. పైకి ఎంతో బాధ్యతగా కనిపించే ఇతను కనిపించిన ప్రతి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టేవాడు.

చిత్రకూట్‌, హామీర్పూర్‌, బండా ప్రాంతాల్లో పేద బాలికలను టార్గెట్‌గా చేసుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఫొటోలు, వీడియోలు తీసి ఇతరులకు పంపించేవాడని తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎరగా వేసి బెదిరించేవాడని దర్యాప్తులో తేలింది.

గతంలో ఎప్పటి నుండో ఇతనిపై లైంగిక ఆరోణలున్నప్పటికీ సాక్ష్యాలు లభించలేదు. దీంతో యుపి పోలీసులు ఈ కేసును సిబిఐకి అప్పగించారు. సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం అతని నివాసంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

పెద్దఎత్తున సిడిలు, మొబైల్‌ఫోన్లు, కొంతమంది బాలికల ఫొటోలు బయటపడ్డాయి. దీంతో అతనిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై యూపీనే కాకుండా యావత్‌ దేశం విస్తుపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం