Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక అంశాలపై ప్రభుత్వం కసరత్తు: నిర్మలా సీతారామన్‌

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (10:20 IST)
ఆర్థిక అంశాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. 
 
దివాలా చట్టంపై ప్రభుత్వం సత్వరం స్పందించిందని ఆమె చెప్పుకొచ్చారు. సోమవారం నుంచి బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇక ఆర్థిక ఉదార విధానాలను కొనసాగిస్తుండటంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్ధంలో రికార్డుస్ధాయిలో దేశంలోకి వచ్చాయని ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్‌ పేర్కొన్నారు.
 
 ప్రాధాన్యేతర రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం వేగవంతం చేసిందని చెప్పారు. ఆర్థిక వృద్ధిని పెంపొందించేందుకు వినియోగం పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని అన్నారు. ప్రభుత్వం గత కొద్దినెలలుగా ప్రకటించిన చర్యలతో ఫలితాలు ఇవ్వడం మొదలైందని తెలిపారు. 
 
కార్పొరేట్‌ ట్యాక్సుల తగ్గింపు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సమీకరణ, నిలిచిపోయిన నిర్మాణ ప్రాజెక్టులకు ఊతం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. రిటైల్ రుణాల జారీ కోసం ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు రూ 4.47 లక్షల కోట్లు మంజూరు చేశామని తెలిపారు. 
 
ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్పొరేట్లకు రూ 2.2 లక్షల కోట్లు, చిన్నమధ్యతరహా కంపెనీలకు రూ 72985 కోట్ల రుణాలను మంజూరు చేశాయని చెప్పారు. ఇక ఇప్పటివరకూ రూ 1.57 లక్షల కోట్ల ఐటీ రిఫండ్‌లను ఆదాయ పన్ను శాఖ జారీ చేసిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 27.2 శాతం అధికమని రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments