Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్ఫీ తెచ్చిన తంటా.. కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం..

Advertiesment
Mumbai
, శనివారం, 14 డిశెంబరు 2019 (09:40 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కారులోనే తిప్పుతూ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ముంబైలో బాధిత యువతి రెస్టారెంట్ వద్ద సెల్ఫీ దిగి తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసింది.

సోషల్ మీడియాలో ఫోటో చూసిన ఓ యువకుడు ఆమె ఉన్న లోకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్లాడు. యువకుడు ఆమె దగ్గరికి వెళ్లి తాను ఆమెకు అభిమానిని అంటూ యువతితో పరిచయం చేసుకున్నాడు. 
 
దీన్ని నమ్మిన  ఆ యువతి అతనితో పరిచయం చేసుకుంది. తర్వాత ఆమెను తనతో బైక్ పై రావాలని కోరాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమెను బలవంతంగా తన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి యువతిని కారులోకి ఎక్కించారు. అనంతరం కదులుతున్న కారులో నలుగురు మూడు గంటల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలపై అత్యాచారాలకు రవాణా సౌకర్యాలు కొరత కూడా ఒక కారణమా?