Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:25 IST)
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా మంగళవారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయి. ఇందులో సభ సజావుగా సాగడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలుపై చర్చించనున్నారు. 
 
కాగా, పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమై 29వ తేదీతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సారథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ దఫా సమావేశానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి బదులు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. 
 
మరోవైపు, ఈ శీతాకాల సమావేశంలో మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, లోక్‌సభ, రాజ్యసభకు చెందిన వివిధ పార్టీలకు ఆహ్వానాలు పంపించారు. ఈ భేటీలో ప్రధాని మోడీ సైతం పాల్గొననున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments