Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిది యూట్యూబ్ చానెళ్లను బ్లాక్ చేసిన కేంద్రం

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (15:20 IST)
భారత్‌కు వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఎనిమిది యూట్యూబ్ చానెళ్ళపై నిషేధం విధించింది. వీటిలో ఏడు చానెళ్లు భారత్‌కు చెందినవికాగా, మరొకటి పాకిస్థాన్‌కు చెందిన చానెల్ ఉంది. ఈ చానళ్లు నకిలీ, భారత్ వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చానెళ్ళపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. 
 
తాజాగా బ్లాక్ చేసిన చానెళ్ళ సంఖ్య 102కు చేరింది. ఒక ఫేస్‌బుక్ అకౌంటెట్‌తో పాటు ఆ ఫ్లాట్‌ఫామ్‌పై రెండు పోస్టులను కూడా కేంద్రం బ్లాక్ చేసినట్టు కేంద్ర టెలికాం, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ తెలిపింది. 
 
కాగా, ఈ 8 యూట్యూబ్ ఛాన‌ళ్ల‌కు మొత్తం 86 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. సుమారు 114 కోట్ల మంది ఆ వీడియోల‌ను చూశార‌ని, అయితే ఆ ఛాన‌ళ్లు విద్వేషాన్ని రెచ్చ‌గొడుతోంద‌ని, మ‌త వ్య‌తిరేక ప్ర‌చారాలు చేస్తున్న‌ట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించి కేంద్రానికి నివేదించింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments