వివాహంలో గొడవ - పెళ్లయిన 2 గంటలకే పెటాకులైన పెళ్లి

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (13:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో గొడవ జరిగింది. ఈ గొడవ ఫలితంగా జరిగిన తంతు కేవలం 2 గంటల్లో ఈ పెళ్లి పెటాకులైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, హెమ్చాపర్ గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లి తంతు ముగిసిన తర్వాత గందరగోళం చెలరేగింది. కొత్త పెళ్లికుమార్తెను అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో స్వల్ప అనారోగ్యంతో వరుడు స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో చాలాసేపు అక్కడ డ్రామా జరిగింది. కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్లనని మొండికేసింది. 
 
జరిగిన వివాహ వేడుకలో వరుడు స్పృహ తప్పిన నేపథ్యంలో పెద్దల మధ్య రెండు గంటలపాటు పంచాయతీ జరిగింది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదరకపోవడంతో ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. హెమ్చాపర్ నివాసి భుఆల్ నిషాద్ ఇంటికి హైదర్‌గంజ్ నుంచి వరునితోపాటు అతని బంధువులు వచ్చారు. వివాహ వేడుక పూర్తయ్యింది. ఇంతలో వరుడు స్పృహ తప్పి పడిపోయాడు. 
 
దీనిని గమనించిన వధువు తరపువారు వరునికి ఏదో వ్యాధి ఉన్నదంటూ పెళ్లని రద్దు చేయాలని పట్టుబట్టారు. 2 గంటలపాటు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వధువు తరపువారు తాము వరునికి ఇచ్చిన కట్నకానుకలు వెనక్కి తీసుకున్నారు. పెళ్లి క్యాన్సిన్ కావడంతో పెళ్ళికి వచ్చినవారంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments