Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేయనివ్వం.. గూగుల్, ఎఫ్‌బీ, ట్విట్టర్

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోసోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని సామాజిక మాధ్యమాలు వెల్లడించాయి. ఈ మేరక

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (15:40 IST)
మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోసోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని సామాజిక మాధ్యమాలు వెల్లడించాయి. ఈ మేరకు సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనరు ఉమేష్‌ సిన్హా సారథ్యంలోని సంఘం గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్ల ప్రాంతీయ అధికారులతో సమావేశమయ్యారు. 
 
ప్రజలను ప్రభావితం చేసేలా తప్పుడు వార్తలు సదరు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కాకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు చేపడతారంటూ ప్రశ్నించగా.. ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేవని.. తాము కట్టుదిట్టమైన చర్యలు చేపడతామంటూ సోషల్ మీడియా ప్రతినిధులు ఉమేష్‌ సిన్హా సారథ్యంలోని కమిటీకి హామీ ఇచ్చినట్లు రావత్ చెప్పారు.
 
పోలింగ్‌‌కు 48 గంటల ముందు నుంచీ తమ సామాజికమాధ్యమాలపై ఎన్నికల సంబంధ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. ఎన్నికల సమయంలో తమ సామాజిక  వేదికలపై అయిన వ్యయం వివరాలు సైతం ఎన్నికల సంఘంతో నేరుగా పంచుకునేందుకు వీలుకల్పించే ఓ వ్యవస్థను కూడా గూగుల్‌ ఏర్పాటు చేయనుందని రావత్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments