Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతిపితను చంపిన గాడ్సే నెం.1 హిందూ టెర్రరిస్ట్: అసదుద్ధీన్ ఓవైసీ

హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మ గాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సేనే నెంబర్ వన్ హిందూ రష్ట్ర టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (08:40 IST)
హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మ గాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సేనే నెంబర్ వన్ హిందూ టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై తనకు నోటీసులు పంపించే దమ్మూధైర్యం ఎవరికైనా వుందా అంటూ సవాల్ విసిరారు.

రామ మందిర నిర్మాణం జరగకపోతే భారత్‌ మరో సిరియాలా తయారవుతుందని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్ అయ్యారు. రవిశంకర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
 
ఇంకా పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ మాట్లాడుతూ... ముస్లింలు భారత దేశాన్ని అమ్మాలనుకోవట్లేదని.. వాళ్లు 70 ఏళ్ల నుంచి దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలంతా పాకిస్థాన్, సిరియా వెళ్లాలని కొందరంటున్నారని.. ఇప్పటికే చాలామంది పాకిస్థాన్‌కు వెళ్లిపోయారని ఒవైసీ తెలిపారు. 
 
తమ పూర్వీకులు కూడా బ్రిటీష్ వారితో పోరాటం చేశారని.. హిందూస్థాన్ జిందాబాద్ అన్నారని ఓవైసీ గుర్తు చేశారు. తాము భారత్‌లోని జీవిస్తాం.. ఇక్కడే ప్రాణాలు కూడా కోల్పాతమని ఓవైసీ ఉద్ఘాటించారు. ట్రిపుల్‌ తలాక్‌ ప్రధానిపై పనిలో పనిగా ఓవైసీ నిప్పులు చెరిగారు. మోదీ ముస్లింలకు శత్రువంటూ దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments