Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మహత్య కోసం పట్టాలపై పడుకున్న బాలిక.. రైలు ఎంతకీ రాకపోవడంతో నిద్రలోకి (Video)

ఠాగూర్
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (11:02 IST)
ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి రైలు పట్టాలపై పడుకుంది. అయితే, రైలు ఎంతకీ రాకపోవడంతో పట్టాలపై గుర్రుపెట్టి నిద్రపోయింది. కానీ రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువేదో కనిపించడంతో లోకోపైలెట్ అత్యవసర బ్రేక్ సాయంతో రైలను నిలిపివేశారు. ఈ రైలు సరిగ్గా ఆమె తలవద్దకు వచ్చి ఆగింది. లోకోపైలెట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం విఫలమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. 
 
రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ యువతి ట్రాక్ మధ్యలో కూర్చొంది. ట్రైన్ ఎంతకీ రాకపోవడంతో సిమెంట్ స్లీపర్‌లపైనే పడుకుని నిద్రపోయింది. అయితే, పట్టాల మధ్య అనుమానాస్పద వస్తువేదో కనిపించడంతో అప్రమత్తమైన లోకోపైలెట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు సరిగ్గా ఆమె తల వద్దకు వచ్చి ఆగింది. ఆపై కిందకి దిగిన పైలెట్ పట్టాల మధ్య నిద్రపోతున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయారు. ఆమెను తట్టిలేపారు. ఏం జరుగుతుందో అర్థంకాని ఆమె ఏడుపు మొదలుపెట్టింది. ఆపై అక్కడే ఉన్న మహిళలతో ఆమెను బలవంతంగా పట్టాలపై నుంచి లాక్కొచ్చారు. తాను రానని ఆ యువతి మొండికేసింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments