Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మహత్య కోసం పట్టాలపై పడుకున్న బాలిక.. రైలు ఎంతకీ రాకపోవడంతో నిద్రలోకి (Video)

ఠాగూర్
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (11:02 IST)
ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి రైలు పట్టాలపై పడుకుంది. అయితే, రైలు ఎంతకీ రాకపోవడంతో పట్టాలపై గుర్రుపెట్టి నిద్రపోయింది. కానీ రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువేదో కనిపించడంతో లోకోపైలెట్ అత్యవసర బ్రేక్ సాయంతో రైలను నిలిపివేశారు. ఈ రైలు సరిగ్గా ఆమె తలవద్దకు వచ్చి ఆగింది. లోకోపైలెట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం విఫలమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. 
 
రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ యువతి ట్రాక్ మధ్యలో కూర్చొంది. ట్రైన్ ఎంతకీ రాకపోవడంతో సిమెంట్ స్లీపర్‌లపైనే పడుకుని నిద్రపోయింది. అయితే, పట్టాల మధ్య అనుమానాస్పద వస్తువేదో కనిపించడంతో అప్రమత్తమైన లోకోపైలెట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు సరిగ్గా ఆమె తల వద్దకు వచ్చి ఆగింది. ఆపై కిందకి దిగిన పైలెట్ పట్టాల మధ్య నిద్రపోతున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయారు. ఆమెను తట్టిలేపారు. ఏం జరుగుతుందో అర్థంకాని ఆమె ఏడుపు మొదలుపెట్టింది. ఆపై అక్కడే ఉన్న మహిళలతో ఆమెను బలవంతంగా పట్టాలపై నుంచి లాక్కొచ్చారు. తాను రానని ఆ యువతి మొండికేసింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments