Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందుకు బాలికను చంపేశారు..

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (19:19 IST)
ఉన్నత విద్య చదవాలని చాలా మంది కోరిక. అలాంటి ప్రయత్నం చేసినందుకు గానూ ఓ బాలికను కొంతమంది దుండగులు చంపేశారు. ఈ దారుణ సంఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలోని సాన్పూరా గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఆశ(17) అనే అమ్మాయి ఇంటర్మీడియట్‌ చదువుతోంది. 
 
అయితే వీరి తెగ ఆచారాల ప్రకారం అమ్మాయిలు పదో తరగతి వరకు మాత్రమే చదవాలి. ఆ తర్వాత చదవకూడదు. కానీ ఆశ మాత్రం ఇంటర్మీడియట్‌లో చేరింది. దీంతో ఆ తెగకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఆశ ఉన్నత విద్య చదవడం ఇష్టం లేక ఆమెను దారుణంగా చంపేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. 
 
అయితే ఆశ సోదరుడు బాబన్ రాయ్ ఆదివారం సాయంత్రం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఏడుగురు వ్యక్తులలో నలుగురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments