Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ బాలిక ప్రాణం తీసింది.. కడుపు నొప్పితో కుప్పకూలింది..

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (11:43 IST)
లాక్ డౌన్ కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. బతుకుదెరువు కోసం వెళ్లిన బాలిక ఇంటికి కొద్ది దూరంలో చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాకు చెందిన జమ్లో మక్దం(12) అనే బాలిక రెండు నెలల క్రితం తెలంగాణకు బతుకుదెరువు కోసం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో మిరప తోటలో పనికి చేరింది ఆ బాలిక. 
 
లాక్‌డౌన్‌ కారణంగా పనులు ఆగిపోయాయి. పూట గడవడం లేదు. దీంచో ఊరెళ్లాలని సదరు బాలికతో పాటు మరో 11 మంది నిర్ణయించుకున్నారు. దీంతో ఏప్రిల్‌ 15వ తేదీన తాము పని చేస్తున్న మిరప తోట ప్రాంతం నుంచి బీజాపూర్‌కు కాలినడకన బయల్దేరారు.
 
రహదారి వెంట వెళ్తే పోలీసులు అడ్డుకుంటారని భావించి.. వారు అడవి మార్గాన్ని ఎంచుకున్నారు. మొత్తానికి ఆ బాలిక గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. శనివారం మధ్యాహ్నం తీవ్రమైన కడుపు నొప్పితో బాలిక బాధపడింది. అక్కడే కుప్పకూలిపోయింది.
 
సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ బాలికకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. పోషకాహారం వల్లే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments