Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ వేగం పుంజుకుందా? దేశంలో పెరిగిపోతున్న కేసులు

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (11:33 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంలో వేగం పుంజుకుందా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే దేశంలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,601కు చేరింది. అలాగే, ఈ వైరస్ బారినపడి మొత్తం 590 మంది చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. గత 24 గంటల్లోనే 47 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. మరోవైపు, ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 3252 మంది కోలుకున్నట్టు చెప్పారు. అలాగే, వివిధ ఆస్పత్రుల్లో 14,759 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. 
 
ఇకపోతే, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4,666కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 232 మంది మృతి చెందారు. 572 మంది కరోనా రోగులు కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,081కి చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 431 మంది కోలుకున్నారు. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గుజరాత్‌లో 1,939 మందికి కరోనా సోకగా, 131 మంది కోలుకున్నారు. 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 1,520 మందికి కరోనా సోకింది. వారిలో 457 మంది కోలుకున్నారు. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో 1,576 మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో 205 మంది కోలుకోగా, 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments