జీడితోటలోకి లాక్కెళ్లి ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి దేవాలయానికి వెళ్లి పూజలు చేసి ఇంటికి తిరిగివస్తున్న ప్రియురాలిపై ప్రియుడు కళ్లెదుటే సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను ప

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (13:29 IST)
ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి దేవాలయానికి వెళ్లి పూజలు చేసి ఇంటికి తిరిగివస్తున్న ప్రియురాలిపై ప్రియుడు కళ్లెదుటే సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిశాలోని గంజాం జిల్లా భంజానగర్‌కు చెందిన ఓ అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ప్రియుడితో కలిసి బుధకెందు తాకూరాణి దేవాలయానికి వెళ్లింది. దేవాలయంలో పూజలు చేసి ఇంటికి తిరుగు ప్రయాణమైన ప్రేయసీప్రియులను రెండు బైక్‌లపై వచ్చిన ఆరుగురు యువకులు అటకాయించారు. 
 
వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రియుడిపై దాడి చేశారు. అనంతరం వారిద్దరినీ దగ్గర్లోని జీడితోటలోకి లాక్కెళ్లి ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి తెగబడడమే కాకుండా, అదేదో ఘనకార్యమైనట్టు సెల్ ఫోన్లలో వీడియో కూడా తీశారు. 
 
దారుణం అనంతరం వారిద్దరినీ అక్కడే వదిలేయగా, వారిద్దరూ కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, ఆరుగురు కీచకులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం