Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతుందని కుమార్తెను హత్య చేసిన తల్లి

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (17:35 IST)
తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి కన్నబిడ్డను హత్య చేసింది. ఈ విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. పైగా, హత్య కేసులో ఇరుక్కోకుండా ఆధారాలను మాయం చేసింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల ఘజియాబాద్‌లో ఒక యువతి మృతదేహాన్ని బైక్‌పై కొందరు తీసుకువెళుండటాన్ని గమనించిన సంగమ్ విహార్‌వాసులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, పలు విషయాలు వెల్లడించారు. ఓ యువతి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 42 యేళ్ల మహిళ కూడా ఉంది.
 
ఆమె పోలీసుల విచారణలో అసలు విషయం చెప్పింది. తన కుమార్తె బాయ్‌ప్రెండ్‌తో తిరుగుతుండటాన్ని గమనించి, గత మూడు నెలల్లో 8 అద్దె ఇళ్లను మార్చామని, అయినప్పటికీ తన కుమార్తె తీరులో మార్పురాలేదని వాపోయింది. ఈ కారణంగానే ఆమెను హత్య చేసినట్టు అంగీకరించింది. తన కుమారుడు స్నేహితులతో కలిసి మృతదేహాన్ని తరలిస్తుండగాచిక్కినట్టు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments