Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోడదూకి ఆస్పత్రిలోకి వెళ్లిన లెఫ్టినెంట్ గవర్నర్... ఎవరు?

పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ ఏ పని చేసినా అది చర్చనీయాంశమవుతోంది. మొన్నటికి మొన్న పుదుచ్చేరిలో మహిళా భద్రతపై అర్థరాత్రి ద్విచక్ర వాహనంపై నగర పర్యటన జరిపారు. ఇపుడు ఓ ఆస్పత్రిలో ఆకస్మిక

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (10:19 IST)
పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ ఏ పని చేసినా అది చర్చనీయాంశమవుతోంది. మొన్నటికి మొన్న పుదుచ్చేరిలో మహిళా భద్రతపై అర్థరాత్రి ద్విచక్ర వాహనంపై నగర పర్యటన జరిపారు. ఇపుడు ఓ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీల నిమిత్తం ఆమె గోడదూకారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే... 
 
పుదుచ్చేరిలో భాగంగా ఉన్న కారైకల్ ప్రాంతానికి కిరణ్ బేడీ ఐదు రోజుల పర్యటన కోసం వెళ్లారు. అక్కడవున్న ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీయాలని భావించారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన ఆమె, విగ్రహం వద్దకు వెళ్లాలని చూశారు. 
 
ఆమె కోరిక తెలుసుకుని అధికారులు తాళాల కోసం లోనికి పరిగెత్తగా, తలుపులు తీస్తారని కాసేపు వేచి చూసిన ఆమెకు, తాళాలు పోగొట్టుకున్నామన్న సమాధానం వచ్చింది. ఇక మరొక్క క్షణం ఎదురుచూడకుండా గోడ దూకి కిరణ్ బేడీ వెళ్లారు. 
 
ఆమెతో పాటు అక్కడే ఉన్న కారైకల్ కలెక్టర్ ఆర్.కేశవన్, ఎస్పీ వీజే.చంద్రన్, ఇతర అధికారులు కూడా మారో మార్గం కనిపించని స్థితిలో గోడ దూకేశారు. ఆపై ఆమె ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించి, పరిసరాలు బాగాలేవని, దోమలు రాజ్యమేలుతున్నాయని చెబుతూ, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments