Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేదెను ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ఇంజిన్ ముందుభాగం విరిగింది...

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (17:10 IST)
ముంబై నుంచి గుజరాత్‌లోని గాంధీ నగర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గేదెను ఢీకొట్టింది. ఈ ప్రమాదం బట్వా- మణినగర్ మధ్య జరిగింది. అయితే ఈ ప్రమాదంలో రైలుకు పెద్దగా నష్టం జరగలేదు కానీ రైలు ఇంజిన్ ముందుభాగం కాస్త విరిగింది. ప్రమాదం తర్వాత ట్రాక్‌ను క్లియర్ చేసిన రైలును మళ్లీ గమ్యస్థానానికి పంపారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
 
దేశంలోనే తొలి హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం మూడు మార్గాల్లో నడుస్తోంది. వందే ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఢిల్లీ నుండి వారణాసి, ఢిల్లీ నుండి కత్రా, సెప్టెంబర్ 30వ తేదీన గుజరాత్‌లోని గాంధీ నగర్ నుండి ముంబైకి ప్రారంభించబడింది. కాగా గాంధీనగర్ వెళుతున్న వందే ఎక్స్‌ప్రెస్ గేదెను ఢీకొట్టడంతో రైలు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయినప్పటికీ పెద్దగా నష్టం జరగకపోవడంతో రైల్వే యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.
 
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగ పరిమితి గంటకు 180 కి.మీ. మరికొద్ది నెలల్లో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణీకుల భద్రత, సౌకర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అందులో వాలుగా ఉండే సీట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఆటోమేటిక్ ఫైర్ సెన్సార్ ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలు, వైఫై సౌకర్యంతో అప్‌గ్రేడ్ చేసిన రైలులో మూడు గంటల బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments