Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆత్మనిర్భర భారత్‌' ద్వారా గాంధీ కలలు సాకారం.. మోదీ

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (10:30 IST)
జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి పూలమాలతో అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్న గాంధీజీ కలలను 'ఆత్మనిర్భర భారత్‌' ద్వారా సాకారం చేస్తామన్నారు. గాంధీజీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చెబుతూ ఆయన స్మృతులతో ఓ చిన్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
 
''అక్టోబర్‌-2 గాంధీజీ పుట్టిన రోజు మనందరికీ ఎంతో పవిత్రమైన, స్ఫూర్తిదాయకమైన రోజు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు ఇప్పటికీ బతికే ఉన్నాయి. నా జీవితమే నా సందేశం అని చెప్పారే తప్ప, తనని అనుసరించాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. కానీ, ఆయన జీవితం అందరికీ ఆదర్శమైంది.'' అని మోదీ అన్నారు. ప్రపంచమంతా ఓ కుటుంబమని గాంధీజీ నమ్మేవారని మోదీ చెప్పారు. సత్యం, అహింస ఆయుధాలుగా ఉద్యమాలను నడిపించారని గుర్తు చేశారు. 
 
''దేశం ఆరోగ్యంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని దీని కోసం పరిశుభ్రత ముఖ్యమని గాంధీజీ చెప్పేవారు. గాంధీజీ ఆలోచనలు మాలో స్ఫూర్తి నింపాయి. అందుకే స్వచ్ఛభారత్‌ నినాదాన్ని అందుకున్నాం. సమాజాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఆయన మాటలు మాకు మార్గనిర్దేశం చేశాయి. గాంధీజీ ప్రభావం మాపై ఎంతైనా ఉందని బలంగా నమ్ముతున్నాను.'' అని మోదీ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments