Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగనయాన్ ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తి...

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (10:31 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వచ్చే యేడాది గగనయాన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇందుకోసం వివిధ రకాలైన ప్రయోగాలను వరుస క్రమంలో నిర్వహిస్తుంది. తాజాగా వ్యోమగాములను అంతరిక్షం నుంచి భూమికి తీసుకొచ్చే పారాచూట్‌లను పరీక్షించింది. 
 
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝూన్సీ జిల్లాలోని ఫీల్డ్ ఫైర్ రేంజ్ వద్ద దాన్ని క్రూడ్ మాడ్యూల్ డీసెలరేషన్ సిస్టంకు చెందిన ఇంటెగ్రేటెడ్ మెయిన్ పారాచూడ్ ఎయిర్ డ్రాఫ్ టెస్ట్‌ను నిర్వహించింది. 
 
అయితే, ఈ ప్రయోగంలో భాగంగా, క్రూ మాడ్యూల్ బరువుకు సమానమైన 5 టన్నుల డమ్మీ బరువును భారత వైమానిక దళానినికి చెందిన ఐఎల్ 76 విమానం ద్వారా 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కిందకు జారవిడిచారు. ఆ తర్వాత ఈ మాడ్యూల్ సురక్షితంగా భూమిపైకి ల్యాండ్ అయింది.  
 
శనివారం చేపట్టిన ఈ ప్రయోగం రెండుమూడు నిమిషాల పాటు కొనసాగింది. పేలోడ్‌ బరువు నేలపై మృదుగువా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో మెయిన్ పారాచూట్‌లు పేలోడ్‌ వేగాన్ని సురక్షితమైన వేగానికి తగ్గించినట్టు ఈ పరీక్షలో తేలింది. ఈ పరీక్షతో గగనయాన్ ప్రాజెక్టు ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకుందని ఇస్రో తెలిపింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments