Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ-20 సదస్సులో పాల్గొన్న రామ్‌ చరణ్‌ - ఘన స్వాగతం పలికిన అధికారులు

Webdunia
సోమవారం, 22 మే 2023 (17:13 IST)
జమ్మూకాశ్మీర్‌ వేదికగా జరుగుతున్న జీ-20 సదస్సులో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పాల్గొన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తూ సోమవారం ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ మేరకు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
 
కాశ్మీర్‌లో ఆర్టికల్‌-370ను తొలగించిన తర్వాత అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచానికి చాటేందుకు, పూర్వ పర్యాటక వైభవ పునరుద్ధరణకు ఇక్కడ సదస్సు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ప్రసిద్ధ దాల్‌ సరస్సు ఒడ్డున ఉన్న షేర్‌-ఏ-కాశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సెంటర్‌లో ఈ సదస్సు జరుగుతోంది. సోమవారం మొదలైన ఈ సదస్సు ఈ నెల 24వ తేదీ వరకు జరగనుంది. పర్యాటక, వాణిజ్యరంగాలపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
 
'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత రామ్‌ చరణ్‌.. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌'లో నటిస్తున్నారు. శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. దిల్‌రాజు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments