Publish Date: Mon, 22 May 2023 (12:05 IST)
Updated Date: Mon, 22 May 2023 (12:12 IST)
G20 సమ్మిట్ కోసం శ్రీనగర్కు బయలుదేరిన రామ్చరణ్. విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సంధర్భంగా ఫొటోలలు పోస్ట్ చేశారు. నాలుగు రోజులపాటు జీ.20 సదస్సు జరుగుతుంది. సోమవారం నాడు సినిమా రంగం, టూరిజం కు సంబందించిన సమిట్ జరుగుతుంది. అందుకే చరణ్ ఈరోజు వెళ్లారు. అలాగే బాలీవుడ్, కోలీవుడ్ ఇతర ఫిలిం ప్రముఖులు హాజరు అవుతున్నారు.
ఆర్.ఆర్.ఆర్. తర్వాత రామ్చరణ్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో ఆయన ఆకర్షణగా నిలిచారు. తాజాగా చరణ్ దర్శకుడు శంకర్ చిత్రంలో 2 పాత్రలు పోషిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లిష్ మూవీలో చేయనున్నాడని తెలుస్తోంది. చరణ్ జీ.20 సమిట్ కు వెళ్లడం అబిమానుల్లో ఆనందం నెలకొంది.