Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత 74 గణతంత్ర వేడుకలు - పద్మ పురస్కారాలు ఇవే

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (11:47 IST)
భారత 74వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్రం ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన ఈ పురస్కారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 12 మందికి ఈ పురస్కారాలు వరించాయి. వీరిలో సుమధుర గేయవాణి వాణీ జయరాం, స్వరకర్త కీరవాణిలు ఉన్నారు. అలాగే, చినజీయర్ స్వామికి పద్మ భూషణ్‌ ప్రకటించారు.
 
ఈ యేడాది మొత్తం 106కి పద్మ అవార్డులను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో 6 పద్మ విభూషణ, 9 పద్మభూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు, ఏడుగురు మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు పద్మ పురస్కారం దక్కిన వారిలో ఉన్నారు. అందులో చినజీయర్ స్వామికి పద్మ భూషణ్, సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఇక తమిళనాడు నుంచి ఐదుగురు, పుదుచ్చేరి నుంచి ఒకరిని పద్మ పురస్కారాల కోసం ఎంపిక చేశారు. తమిళనాడు కోటాలో సీనియర్ గాయని వాణీ జయరాంకు పురస్కారం దక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments