Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్‌క్రీమ్‌లో కప్ప.. వాంతులు చేసుకున్న చిన్నారులు ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (13:22 IST)
ఐస్‌క్రీమ్‌లో కప్ప వుండటం చూడకుండా తిన్న చిన్నారులు అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన తమిళనాడు మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురై కోవలన్ నగర్ మణిమేగల వీధికి చెందిన అన్బుసెల్వం. ఆయన భార్య జానకిశ్రీ.కుమారస్వామి ఆలయానికి వెళ్లారు. ఆయన తన కుమార్తెలు మిత్రశ్రీ (వయస్సు 8), రక్షణశ్రీ (7), ధరణి (4)లను కూడా వెంట తీసుకెళ్లాడు.
 
ఆ తర్వాత గుడి సమీపంలోని శీతల పానీయాల దుకాణంలో పిల్లలకు జిగర్తాండను కొనుగోలు చేశాడు. ఇది తాగిన ముగ్గురు చిన్నారులు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన జానకిశ్రీ పిల్లలు తాగే జిగర్తాండను కొనుగోలు చేసింది. 
 
అప్పుడు అందులో ఉంచిన ఐస్‌క్రీమ్‌లో ఒక కప్ప చనిపోయి పడి ఉంది. అనంతరం వాంతులు చేసుకున్న ముగ్గురు చిన్నారులను సమీపంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందించారు
 
ఐస్‌క్రీమ్‌లో కప్ప పడి ఉండడంపై జానకిశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శీతల పానీయాల దుకాణం యజమాని దురైరాజన్ (60)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments