Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్‌క్రీమ్‌లో కప్ప.. వాంతులు చేసుకున్న చిన్నారులు ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (13:22 IST)
ఐస్‌క్రీమ్‌లో కప్ప వుండటం చూడకుండా తిన్న చిన్నారులు అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన తమిళనాడు మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురై కోవలన్ నగర్ మణిమేగల వీధికి చెందిన అన్బుసెల్వం. ఆయన భార్య జానకిశ్రీ.కుమారస్వామి ఆలయానికి వెళ్లారు. ఆయన తన కుమార్తెలు మిత్రశ్రీ (వయస్సు 8), రక్షణశ్రీ (7), ధరణి (4)లను కూడా వెంట తీసుకెళ్లాడు.
 
ఆ తర్వాత గుడి సమీపంలోని శీతల పానీయాల దుకాణంలో పిల్లలకు జిగర్తాండను కొనుగోలు చేశాడు. ఇది తాగిన ముగ్గురు చిన్నారులు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన జానకిశ్రీ పిల్లలు తాగే జిగర్తాండను కొనుగోలు చేసింది. 
 
అప్పుడు అందులో ఉంచిన ఐస్‌క్రీమ్‌లో ఒక కప్ప చనిపోయి పడి ఉంది. అనంతరం వాంతులు చేసుకున్న ముగ్గురు చిన్నారులను సమీపంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందించారు
 
ఐస్‌క్రీమ్‌లో కప్ప పడి ఉండడంపై జానకిశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శీతల పానీయాల దుకాణం యజమాని దురైరాజన్ (60)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments