Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం కోర్టు జడ్జీల తిరుగుబాటు.. దేశ చరిత్రలో ప్రప్రథమం

భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏ దేశంలో జరగని విధంగా సుప్రీంకోర్టు జడ్జీలు మీడియా ముందుకు వచ్చారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని నలుగురు జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, రంజన్, మదన్ లోకూర్, రంజన్ గొగోయ

Webdunia
శుక్రవారం, 12 జనవరి 2018 (13:40 IST)
భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏ దేశంలో జరగని విధంగా సుప్రీంకోర్టు జడ్జీలు మీడియా ముందుకు వచ్చారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని నలుగురు జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, రంజన్, మదన్ లోకూర్, రంజన్ గొగోయ్‌లు నిరసన వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తీరుపై తిరుగుబాటు చేశారు. ఢిల్లీలోని జస్టిస్ చలమేశ్వర్ ఇంట్లో నలుగురు సీనియర్ జడ్జీలు మీడియా  సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టులో గత కొన్ని నెలలుగా సుప్రీంకోర్టు కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా సాగడం లేదని ఆరోపించారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు లేఖ రాసినా పట్టించుకోలేదనీ, అందువల్ల విధిలేని పరిస్థితుల్లో దేశ చరిత్రలోనే తొలిసారి మీడియా ముందుకు వచ్చినట్టు ప్రకటించారు. 
 
జడ్జీల మాటలు ఇలా ఉన్నాయి :
సుప్రీంకోర్టులో కొన్ని నెలలుగా అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నాయి. పరిపాలన వ్యవహారాలు సరైన పద్దతిలో జరగటం లేదు. వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. నాలుగు నెలలు క్రితం కొలీజియంలోని నలుగురు జడ్జీల సంతకాలతో లేఖ రాశాం. అయినా పరిపాలన వ్యవస్థలో మార్పు లేదు. మా ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని తీసుకున్నాం. మీడియా ముందుకు వచ్చాం. మా ఆవేదనను బహిరంగంగా వెల్లడించాలని నిర్ణయించుకున్నాం. సుప్రీంకోర్టులో పరిపాలన, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు.
 
సుప్రీంకోర్టులో పరిపాలన సరిగా లేదు. అది మాపై ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్‌లో ఈ జడ్జీలు ఎందుకిలా చేశారు.. ఈ వ్యవస్థ ఎందుకిలా తయారు అయ్యింది అని ఎవరూ అనుకోకూడదు. కేసుల విషయంలో ఈ తీర్పులు ఏంటీ అని దేశ ప్రజలు అనుకోకూడదు. ఓ కేసు విషయంపై మేం.. మా అభిప్రాయాలను లేఖ రూపంలో చీఫ్ జస్టిస్‌కు తెలియజేశాం. అయినా పరిస్థితిలో మార్పు లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక.. సమస్య ఇక పరిష్కారం కాదేమో అని భయపడి.. విధిలేని పరిస్థితుల్లో.. దేశ ప్రజలకే వాస్తవాలను వివరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments