Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ రైలులో విమాన సౌకర్యాలు...

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో ఓ శుభవార్త తెలిపింది. శతాబ్ది, దురంతో వంటి రైళ్లలో విమానంలో ఉండే సౌకర్యాలను కల్పించనున్నట్టు వెల్లడించింది. అంతేనా ఈ తరహా సౌకర్యాలను తొలిసారి శతాబ్ది ఎక

Webdunia
శుక్రవారం, 12 జనవరి 2018 (12:30 IST)
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో ఓ శుభవార్త తెలిపింది. శతాబ్ది, దురంతో వంటి రైళ్లలో విమానంలో ఉండే సౌకర్యాలను కల్పించనున్నట్టు వెల్లడించింది. అంతేనా ఈ తరహా సౌకర్యాలను తొలిసారి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రవేశపెట్టారు. ఈ రైలు చెన్నై సెంట్రల్ - మైసూరు ప్రాంతాల మధ్య నడుస్తోంది. 
 
ఈ రైలులో ప్రతి సీటుకు ఇన్ఫోటెయిన్‌మెంట్ తెరలు, యూజర్ ఫ్రెండ్లీ స్నాక్ టేబుల్, సౌకర్యవంతమైన సీట్, రెక్నినింగ్ సదుపాయాలను కల్పించారు. అలాగే, టాయిలెట్లను హ్యాండ్స్-ఫ్రీ పీపాలోహిత వ్యవస్థతో అమర్చారు. రైలు బోగీ తలుపులకు ఆటోమేటెడ్ సెన్సార్-ఎనేబుల్ చేశారు. ప్రయాణికుల సీట్ల వద్ద కాలింగ్ బెల్‌తో పాటు విలాసవంతమైన సౌకర్యాలు రైలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. 
 
ప్రత్యేకంగా రూ.3 కోట్ల వ్యయంతో కూడిన కోచ్‌ను ప్రయాణికులకు విమాన సదుపాయాలతో పెరంబూర్ సమీకృత కోచ్ ఫ్యాక్టరీ (ఇటెంగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ -ఐసీఎఫ్)లో నిర్మించారు. చెన్నై నుంచి మైసూరు వెళ్లే ఈ రైలుకు శుక్రవారం నుంచి పచ్చజెండా ఊపారు. ఈ సౌకర్యాలతో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments