Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో ఘోరం.. కారులో యువతిపై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (13:02 IST)
బెంగళూరులో ఘోరం జరిగింది. కదులుతున్న కారులో ఓ యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. బెంగళూరు నగర నడిబొడ్డున ఓ యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ ముందే కారులో కిడ్నాప్ చేసి పలు ప్రాంతాల్లో సంచరిస్తూ కొన్ని గంటల పాటు అత్యాచారం చేయడం కలకలం రేపింది. 
 
బెంగళూరులోని ఈజీపురకు చెందిన ఓ యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మార్చి 25న రాత్రి 9.30 గంటల సమయంలో కోరమంగళలోని పార్కులో కూర్చుంది. ఆమె స్నేహితుడు ఇద్దరు స్నేహితులతో వచ్చాడు. వారు కారులో యువతిని కిడ్నాప్ చేశారు. 
 
రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అదే కారులో నిరంతరం ఆ యువతి మీద నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కామం తీర్చుకున్న యువకులు రోడ్డుపక్కన వదిలేసి పారిపోయారు. 
 
తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసింది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments