Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మాజీ మంత్రి సుఖరామ్ ఇకలేరు..

Webdunia
బుధవారం, 11 మే 2022 (10:55 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రామ్ ఇకలేరు. ఆయన 94 యేళ్ళ వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన్ను ఈ నెల 7వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోచేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూసినట్టు ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో పాటు తన తాతతో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోను కూడా షేర్ చేశారు. 
 
కాగా, ఈ నెల 4వ తేదీన సుఖ్‌రామ్ మనాలిలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయన్ను మండిలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. ఇందుకోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రభుత్వ హెలికాఫ్టర్‌ను కూడా పంపించారు. 
 
కాగా, సుఖ్‌రామ్ గత 1993 నుంచి 1996 వరకు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. ఐదుసార్లు విధాన సభకు, మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్థక శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆయన రాష్ట్ర రైతుల ఆదాయం పెంపుకోసం విస్తృతంగా కృషి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments