Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు ఓవరాక్షన్.. జీపుపై మహిళను కట్టేసి.. ఊరంతా తిప్పారు..

పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మీరట్‌లో నిన్నటికి నిన్న ముస్లిం యువకుడిని ప్రేమించిందనే కారణంగా ఓ యువతిపై మహిళా పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (14:39 IST)
పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మీరట్‌లో నిన్నటికి నిన్న ముస్లిం యువకుడిని ప్రేమించిందనే కారణంగా ఓ యువతిపై మహిళా పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన మరవక ముందే పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. పోలీస్ జీపుపై మహిళను కట్టేసి.. పోలీసులు ఊరంతా తిప్పారు. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని చవిందా దేవి గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ ఆస్తి వ్యవహారంలో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో నిందితుడు ఇంట్లో లేడు. ఇక కుమారుడు, ఇంట్లో వుండి మహిళ భర్తను తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ పోలీసులను ఆ మహిళ అడ్డుకుంది. భర్తను, కుమారుడుని తీసుకెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు ఆమెను బలవంతంగా జీపు పైన కట్టేసి ఊరంతా తిప్పారు. 
 
ఆ వేగానికి ఆమె జీపు పైనుంచి కిండపడిపోయి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలి బంధువులు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. 
 
తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఘటనపై విచారణకు ఆదేశించింది. మహిళను అలా జీపుపై కట్టేసి తిప్పడం ఏమిటని నెటిజన్లు కూడా పోలీసులపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments