ఉత్తరాదిలో కుంభవృష్టి... ప్రమాద స్థాయిని దాటిన యమునా నది.. ఢిల్లీలో అలెర్ట్

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (10:45 IST)
ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో అనేక నదులు పొంగిపోర్లుతున్నాయి. మరికొన్ని ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. ఎగువ రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో ఢిల్లీలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం 206.28 మీటర్లుగా ఉంది. సాయంత్రానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఢిల్లీ యంత్రాంగం అప్రమత్తమైంది. యమునా నది పరిసర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను సోమవారం రాత్రి నుంచి చేపట్టారు. ఢిల్లీలో అత్యధిక వరద ముప్పు స్థాయి 207.49 మీటర్లు. ప్రస్తుతానికి ఆ మార్క్‌ను చేరే అవకాశం లేదని, వర్షాలు తగ్గుముఖం పడితే నీటిమట్టం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments