Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువుల యజమానికి ఐదు చెప్పు దెబ్బలు.. గ్రామ సర్పంచ్ నిర్ణయం

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (17:13 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం ఇపుడు వివాదాస్పదమైంది. ఈ గ్రామంలోని పశువులు ఆరుబయట స్వేచ్ఛగా తిరేగందుకు వీలు లేదని నిబంధన విధించింది. ఇది వివాదాస్పదమైంది. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, వెంటనే ఆ నిబంధనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, పంచాయతీ సిబ్బంది మాత్రం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కొత్త నిబంధన గురించి వివరిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని షాహ్‌దోల్‌ జిల్లా నగ్నాదుయ్‌ గ్రామస్థులు తమ పశువులను వీధుల్లో స్వేచ్ఛగా తిరగనివ్వకూడదని ఆ గ్రామ సర్పంచ్‌ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. పశువుల నిర్వహణలో గ్రామస్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతోపాటు, రోడ్లపై వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. 
 
ఒకవేళ ఎవరైనా తమ పశువులను గ్రామంలోని వీధుల్లో తిరిగేందుకు విడిచిపెడితే.. వాటి యజమానికి ఐదు చెప్పు దెబ్బలతోపాటు, రూ.500 జరిమానా విధిస్తామని చాటింపు వేయించారు. ఈ మేరకు గ్రామంలో కొత్త నిబంధనపై ప్రకటన చేయించారు. అయితే, ఈ ప్రకటన విన్న గ్రామస్థులు మాత్రం ఇదేం వింత నిబంధన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకొని.. నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments