Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువుల యజమానికి ఐదు చెప్పు దెబ్బలు.. గ్రామ సర్పంచ్ నిర్ణయం

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (17:13 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం ఇపుడు వివాదాస్పదమైంది. ఈ గ్రామంలోని పశువులు ఆరుబయట స్వేచ్ఛగా తిరేగందుకు వీలు లేదని నిబంధన విధించింది. ఇది వివాదాస్పదమైంది. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, వెంటనే ఆ నిబంధనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, పంచాయతీ సిబ్బంది మాత్రం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కొత్త నిబంధన గురించి వివరిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని షాహ్‌దోల్‌ జిల్లా నగ్నాదుయ్‌ గ్రామస్థులు తమ పశువులను వీధుల్లో స్వేచ్ఛగా తిరగనివ్వకూడదని ఆ గ్రామ సర్పంచ్‌ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. పశువుల నిర్వహణలో గ్రామస్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతోపాటు, రోడ్లపై వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. 
 
ఒకవేళ ఎవరైనా తమ పశువులను గ్రామంలోని వీధుల్లో తిరిగేందుకు విడిచిపెడితే.. వాటి యజమానికి ఐదు చెప్పు దెబ్బలతోపాటు, రూ.500 జరిమానా విధిస్తామని చాటింపు వేయించారు. ఈ మేరకు గ్రామంలో కొత్త నిబంధనపై ప్రకటన చేయించారు. అయితే, ఈ ప్రకటన విన్న గ్రామస్థులు మాత్రం ఇదేం వింత నిబంధన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకొని.. నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments